శంఖములు, గవ్వలు మొదలగునవి స్వచ్చమైన నీటిపై తేలియాడుతూ,
తీరమును తాకుతూ, అచ్చటినుండి అందమైన ఎర్రని తామరలు వికసించు
కొలనులలోనికి చేరు దృశ్యములు మెండుగా గోచరించు ఆ పుండరీకమున,
బంగారు కడియములను పాద పద్మములకు ధరించి వెలసిన ఆ భగవంతుడు,
తన చుట్టూ చేరి, వలయముగా ఏర్పడిన దేవతలచే పూజించబడుతున్న ఆ పరమశివుడే!
ఓ! గొప్పవాడా! నందిపై స్వారీచేయుట ఒక ఘనకార్యమా!? దయచేసి తెలియచేయుము.
[అనువాదము: సశికళ దివాకర్, విశాఖపట్నం, 2011]