ఎర్రని కేశములపై చంద్రవంక మరియు నల్ల త్రాచు కలిసియుండ
ఆ పరమశివుడు, పరిమళములను వెదజల్లు పుష్పగుచ్చములుగల ఉద్యానవనములు,
బంగారువన్నె కలిగి రక్షణకొరకు ధృడముగా, ఎత్తుగా ఆకాశమును అంటినట్లు కట్టబడి ఉన్న భవనములు
చుట్టూరా ఉండగా, ఆ పూంతరై ప్రాంతమున సుస్థిరముగా వెలసియున్నాడు.
ఓ! పరంధామా! తమ మూడవ నేత్రమును తెరచి, మన్మధుని భస్మము చేసిన పిదప ఆ కళ్ళ కోణములు ఎర్రగా మారుటకు గల కారణమును తెలియచేయుము.
[అనువాదము: సశికళ దివాకర్, విశాఖపట్నం, 2011]