గుండ్రని పాత్రవలే వికసించి, ఎర్రటి వర్ణముతో కూడియుండునదై పుష్పించి, విరాజిల్లు తామర పుష్పదళములను
చించి, అందమైన ఇసుకతో కూడిన తీరముపై పరచు హంసలు గల తిరువలంచుళియిల్ నందు, శరీరముపై పూయబడిన సున్నమువలే,
విభూతి పొడిని మేనియంతా పూసుకొనుటలో ప్రసిద్ధునిగ విరాజిల్లు ఓ భగవంతుడా! దేవతలందరూ మీ వద్దకు వచ్చి శిరస్సువంఛి వండనమొసగు,
ఔన్నత్యముగలవాడివైననూ, తలపుఱ్ఱెలో భిక్షనర్థించుచూ సంచరించుటకు గల కారణమేమి? దయతో మాకు తెలియజేయుము.
[అనువాదము: సశికళ దివాకర్, విశాఖపట్నం, 2011]