సారవంతమైన నేలగల అరణ్యములందు లభ్యమగు మేలిమివర్ణపు మణులను తీసుకొనిపోయి
వెనువెంటనే, ఆవలనున్నఇసుకతో కూడియున్న నేలపై పరచి, వానిపై జీవించు హంసలుగల తిరువలంచుళియిల్ నందు, వెలసి అనుగ్రహించుచున్న
పదునైన మొనలుగల తెల్లటి త్రిశూలముతో, తెల్లని మల్లిమొగ్గవంటి స్వచ్ఛమైన చిరునవ్వును చిలికించు ఉమాదేవిని ఏలుకొను జ్యోతిస్వరూపుడా!
శ్రమను కలిగించు కపాలమునందు భిక్షనర్థించుటలోని అంతరార్థమేమిటో దయచేసి మాకు తెలియజేయుము!
[అనువాదము: సశికళ దివాకర్, విశాఖపట్నం, 2011]