పుణీతమైన నీరు వచ్చి వెడలు కావేరీ వాగుపై, పలుపుష్పములను వెదజల్లి, ఆ జలమందు పవిత్ర స్నానమాచరించువారియొక్క
దుఃఖములనన్నింటినీ పోగొట్టి, దయననుగ్రహించువానిగ తిరువలంచుళియిల్ నందు వెలసి,
తన పరాక్రమమును పెద్దదని తలచి అహంకారముతో వచ్చిన రావణాసురుని గతమున అణచివేసినవాడా! ప్రఖ్యాతి గల తెల్లటి కపాలమందు
భిక్షనర్థించుట మీ యొక్క ఔన్నత్యమునకు అందమును చేకూర్చునదేనా? తెలియజేయుము!
[అనువాదము: సశికళ దివాకర్, విశాఖపట్నం, 2011]